రాబోయే 24 గంటల్లో యాస్ తుఫాను తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం ఇవాళ(సోమవారం) తెలిపింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లో బుధవారం తీరం దాటుతుందని తెలిపింది. ఈ సమయంలో 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది. పశ్చిమ తీరంలో తౌక్టే తుఫాన్లా ఇది కూడా తీవ్రంగా మారే అవకశాలున్నాయని అధికారులు అంచనావేస్తున్నారు.
ప్రస్తుతం తుఫాన్ పోర్ట్ బ్లెయిర్కు 600 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది వాతావరణ విభాగం. ఈ తుఫాన్ కారణంగా ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలు హైఅలర్ట్ను ప్రకటించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో NDRF, సైన్యం, కోస్టల్ గార్డ్ ను మోహరించారు. ఈ తుఫాను కారణంగా ప్రభావితమైన ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్,తమిళనాడుతో పాటు అండమాన్ నికోబార్ దీవులకు కూడా NDRF టీంలను తరలించారు.
