పోలీసులు డబ్బు పంచారనడం నిరాధారం: సీపీ

పోలీసులు డబ్బు పంచారనడం నిరాధారం: సీపీ

హుజూరాబాద్ లో ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుందని సీపీ సత్యనారాయణ అన్నారు. ఇప్పటివరకు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన అన్నారు. ‘పోలీసులు డబ్బు పంచారనడం నిరాధార ఆరోపణలు, అవాస్తవాలని సీపీ సత్యనారాయణ చెప్పారు. ఇప్పటివరకు రూ. 3.5 కోట్లు సీజ్ చేశాం. డబ్బులు పంచుతున్నారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి కానీ మాకు మాత్రం ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. ఇప్పటివరకు ఓటర్లకు డబ్బులు ఆఫర్ చేసినోళ్ల మీద మూడు కేసులు, తీసుకున్నోళ్ల మీద రెండు కేసులు పెట్టాం. ఆఫర్ చేయడం ఎంత నేరమో, తీసుకోవడమూ అంతే నేరం’ అని సీపీ అన్నారు.