కేటీఆర్ గూండా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు.. హుజూరాబాద్​ కాంగ్రెస్​ ఇన్​చార్జ్​ ప్రణవ్ బాబు

కేటీఆర్  గూండా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు.. హుజూరాబాద్​ కాంగ్రెస్​ ఇన్​చార్జ్​ ప్రణవ్ బాబు

బీఆర్​ఎస్​ రజతోత్సవ సభకు ఆ పార్టీ ఎమ్మెల్యే.. హుజూరాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి అక్రమాలకు.. అరాచకాలకు పాల్పడుతున్నారని  హుజూరాబాద్​ కాంగ్రెస్​ ఇన్​ చార్జ్​ ప్రణవ్​ బాబు తెలిపారు.  ఎమ్మెల్యే గూండా గిరి చేస్తూ వ్యాపారస్తులను బెదిరించి... డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.  ఏప్రిల్​ 27న జరిగే బీఆర్​ఎస్​ రజతోత్సవ సభకు గ్రానైట్​ వ్యాపారి నుంచి రూ. 50 లక్షలు డిమాండ్​ చేశారన్నారు. 

గూండా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కేటీఆర్​..గతంలో పదేళ్లు దోచుకున్నారు.. ఇప్పుడు కేటీఆర్ బినామీగా  కౌశిక్​ రెడ్డి డబ్బులు వసూలు చేయమన్నారా అని హుజూరాబాద్​ కాంగ్రెస్​ నేత ప్రణవ్​ బాబు ప్రశ్నించారు.  ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డిపై ఓ మహిళ ఫిర్యాదు చేస్తే కేటీఆర్​  ఎందుకు స్పందించడంలేదన్నారు.   ఉప ఎన్నికలు వస్తే బీఆర్​ఎస్​ గెలుస్తుందంటున్న కేటీఆర్​.. దమ్ముంటే హుజేరాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డితో రాజీనామా చేయించి గెలవమనండని సవాల్​ చేశారు..