
హైదరాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం పరిధిలో మొత్తం 5 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు (పిఎస్కెలు), 14 పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు (పిఒపిఎస్కె) 4వేల దరఖాస్తులను స్వీకరించాయి. అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 27వరకు రోజుకు 2వేల 800 పాస్పోర్ట్లను జారీ చేసినట్లు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి (RPO), MEA శాఖ సెక్రటేరియట్ హెడ్ దాసరి బల్లయ్య తెలిపారు.
పాస్పోర్ట్ల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతున్నందున, ఈ కేంద్రాలు 2023 ఆగస్టు నుంచి శనివారాల్లో పని చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పాస్పోర్ట్ దరఖాస్తులలో పెండింగ్ పెరిగిందని కూడా బల్లయ్య చెప్పారు. దరఖాస్తులు పెండింగ్లో ఉన్న, అత్యవసరంగా ప్రయాణించాల్సిన దరఖాస్తుదారులకు హాజరు కావడానికి, RPO కార్యాలయంలో రెండు విచారణ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజుకు 250 మంది దరఖాస్తుదారులు హాజరవుతున్నారు.
Also Read :- ఆస్పత్రిలో బెడ్ లేక.. చికిత్స అందక..
“250 మందిలో, దరఖాస్తుదారులు విచారణ కౌంటర్లను సందర్శించడానికి 125 ఆన్లైన్ అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే 125 వాక్-ఇన్ టోకెన్లు, ఆన్లైన్ అపాయింట్మెంట్లను కలిగి ఉన్న దరఖాస్తుదారులు క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల, దరఖాస్తులు పెండింగ్లో ఉన్న, ప్రయాణానికి అత్యవసరంగా ఉన్న దరఖాస్తుదారులందరూ తమ అపాయింట్మెంట్లను ఎటువంటి రుసుము లేకుండా www.passportindia.gov.in లో విచారణ కౌంటర్లను సందర్శించడానికి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని దాసరి బాలయ్య తెలిపారు.