
హైదరాబాద్ సిటీ, వెలుగు: అర్ధరాత్రి వేళలో ఛత్రినాక పీఎస్పరిధిలో రోడ్లపై తిరుగుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఏడుగురు యువకులకు నాంపల్లి కోర్టు వారం రోజుల జైలు శిక్ష విధించింది. కృష్ణారెడ్డి నగర్కు చెందిన మొహ్ద్ అమన్ (25), అహ్మద్ కాలనీకి చెందిన ఎండీ యూసుఫ్ (25), ఫూల్బాగ్కు చెందిన సోహైల్ అలియాస్అజీమ్ (19), కృష్ణారెడ్డినగర్కు చెందిన కె. శ్రీకాంత్ (18), షేక్ యాసీన్ (23), సయ్యద్ అబ్దుల్లా (21), చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ గౌస్ (25) కొద్దిరోజుల కింద ఛత్రినాక రోడ్లపై రాత్రిపూట తిరుగుతూ న్యూసెన్స్చేశారు.
దీంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సయ్యద్అబ్దుల్లాపై చాంద్రాయణగుట్టలో రౌడీ షీట్నడుస్తోంది. అందరినీ నాంపల్లి 9వ మెట్రోపాలిట్మెజిస్ట్రేట్ఎదుట హాజరుపరచగా, శిక్ష విధించిందని ఛత్రినాక సీఐ కె.ఎన్. ప్రసాద్ వర్మ తెలిపారు.