యూఎన్ఐడీఓ సమావేశంలో ప్రసంగించిన చక్రవర్తి

యూఎన్ఐడీఓ సమావేశంలో ప్రసంగించిన చక్రవర్తి

హైదరాబాద్, వెలుగు: ప్యాకేజింగ్ నిపుణుడు, ఎకోబ్లిస్ ఇండియా చైర్మన్  మేనేజింగ్ డైరెక్టర్,  వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూపీఓ) గ్లోబల్ అంబాసిడర్  ఎ.వి.పి.ఎస్​ చక్రవర్తి  థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజధాని బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ యూఎన్​ఐడీఓ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టేబుల్ సమావేశంలో  ప్రత్యేక  అతిథిగా ప్రసంగించారు.  “ఆసియాలో ఆహార ప్యాకేజింగ్ పరిశ్రమలో స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడం” అనే అంశంపై  డబ్ల్యూపీఓ,  వాగెనింగెన్ విశ్వవిద్యాలయం అండ్​ రీసెర్చ్ చర్చా కార్యక్రమం నిర్వహించాయి.

ఆసియా ఖండంలోని 15 పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “భారతదేశంలో పంటల కోత అనంతరం 30శాతం వరకు ఆహార నష్టం జరుగుతోంది. దీనికి కారణాలు తగిన ప్యాకేజింగ్ లేకపోవడం, హ్యాండ్లింగ్ లోపాలు,  చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం. ప్యాకేజింగ్​ను ఖర్చు గా పరిగణించకూడదు.   విలువను కాపాడేదానిగా దీనిని చూడాలి. మా దేశ ప్యాకేజింగ్ ఆవిష్కరణలు ప్రపంచం మెప్పు పొందాయి.  ఇండియాలో పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్ అభివృద్ధి చెందుతోంది” అని చక్రవర్తి వివరించారు.