- గోషామహల్ లో సిటీ పోలీసుల స్పోర్ట్స్ మీట్
- స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ
తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు, తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు డిపార్ట్మెంట్ కి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గోషామహాల్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ పోలీసుల..స్పోర్ట్స్ మీట్ ను హోంమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ .. కరోనా టైం లో పోలీసులు కృషి వెలకట్టలేనిదని, ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణ పోలీసులను మెచ్చుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుండటంతో తెలంగాణ కి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. పోలీసులందరూ ఎదో ఒక గేమ్ ని అలవాటు చేసుకోవాలని, టీమ్ స్పిరిట్ ని పెంచడానికి స్పోర్ట్స్ ఉపయోగపడతాయని అన్నారు.
పోలీసులు తమ డ్యూటీ చేయాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ముఖ్యమని, ప్రతీ ఒక్కరు ఫిజికల్ ఫిట్నెస్ కోసం కొంత టైం కేటాయించాలన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని పోలీసులు పాటించాలని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు డిపార్ట్మెంట్ సక్సెస్ అవుతుందన్నారు. హైదరాబాద్లో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. చట్టాన్ని వయలేట్ చేసేవారి పై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. టెటెక్నాలజీ సాయంతో క్రైమ్ ను కంట్రోల్ చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లోని ప్రతీ పోలీస్స్టేషన్లో జిమ్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
గత ఏడేళ్లలో తెలంగాణ పోలీసులకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందన్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. సిటీజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో తెలంగాణ ముందుందని చెప్పారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉందన్నారు. పోలీస్ రిక్రూట్ మెంట్ లో ప్రభుత్వం 33శాతం మహిళలకు కేటాయించిందని చెప్పారు.