జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు గ్యాస్ అందిన 25 రోజుల తర్వాత మళ్లీ బుక్చేయాలని హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. గ్యాస్కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ దవాఖానలు, హాస్టల్స్, ఇండ్లకు సరఫరాను అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకున్నట్టు చెప్పారు.
గ్యాస్కొరత లేదని, వినియోగదారుల భయపడి బుక్చేస్తుండడం వల్లే డిమాండ్ పెరిగి సరఫరా ఆలస్యం అవుతుందన్నారు. ప్రజల ఫోన్ కాల్స్ కు స్పందించాలన్నారు. ఎల్పీజీ సరఫరా, సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్జాయింట్ కమిషనర్ శ్వేత, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్రాజిరెడ్డి, జిల్లా సివిల్ సప్లయీస్ఆఫీసర్శ్రీనివాస్, వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటి పాల్గొన్నారు.
