ఖతర్ ఎయిర్​వేస్​కు రూ. 45 వేల ఫైన్

ఖతర్ ఎయిర్​వేస్​కు రూ. 45 వేల ఫైన్

పద్మారావునగర్, వెలుగు:  ఖతర్ ఎయిర్‌‌ వేస్ కు​హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జరిమానా విధించింది. ఎక్కువ టికెట్ రేట్​ఉన్న ఇంటర్నేషనల్ ఫ్లైట్ కు బదులు తక్కువ టికెట్ రేట్​ఉన్న ఫ్లైట్ ను కేటాయించడంతో రూ.45 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. సికింద్రాబాద్ నేరేడ్​మెట్​కు చెందిన పసుమూర్తి రమాకాంత్(73) తన మనవడికి యూరప్​లో ఇంటర్నేషనల్ చెస్​చాంపియన్ షిప్​​టోర్నీ ఉండడంతో గతేడాది జూన్​లో అక్కడికి వెళ్లారు. 

తిరుగు ప్రయాణంలో బుడాపెస్ట్ నుంచి దోహా మీదుగా హైదరాబాద్ రావడానికి తనతోపాటు భార్య, మనవడికి కలిపి మూడు విమాన టికెట్లను ఖతర్ ఎయిర్ వేస్ నుంచి కొనుగోలు చేశారు. అయితే, బుడాపెస్ట్ ఎయిర్​పోర్టులో వీరికి తక్కువ రేట్​కలిగిన ఇండిగో ఫ్లైట్​కు సంబంధించిన బోర్డింగ్ పాస్​ను ఇష్యూ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలా ప్లైట్ ను మార్చడంతో రమాకాంత్, ఆయన భార్య, మనవడు చాలా ఇబ్బందులు పడ్డారు. వయస్సు రీత్యా తాము సమస్యలు ఎదుర్కొన్నామని ఫిర్యాదు చేస్తూ రమాకాంత్ కన్జూమర్ ఫోరమ్ ను ఆశ్రయించగా, కమిషన్​ఈ మేరకు తీర్పు చెప్పింది.