ఇద్దరు హెచ్‌‌సీఏ క్రికెటర్లపై బ్యాన్‌‌

ఇద్దరు హెచ్‌‌సీఏ క్రికెటర్లపై బ్యాన్‌‌

హైదరాబాద్, వెలుగు: ఏజ్ ఫ్రాడ్‌‌కు పాల్పడిన ఇద్దరు క్రికెటర్లపై హైదరాబాద్ క్రికెట్‌‌ అసోసియేషన్ (హెచ్‌‌సీఏ) కఠిన చర్యలు తీసుకుంది. టీమ్‌‌లో ప్లేస్ కోసం తమ ఏజ్‌‌ను తక్కువగా చూపిస్తూ నకిలీ పత్రాలు ఇచ్చిన మహ్మద్ బిన్ హుస్సేన్ బబిల్లాయిల్ (అండర్ 19), శశాంక్‌‌ మల్షోత్రా (అండర్ 23)పై ఐదేళ్ల బ్యాన్‌‌ విధించింది. 

 ఈ ఇద్దరినీ హెచ్‌‌సీఏ జట్ల నుంచి తొలగించడంతో పాటు పోలీసు కేసు కూడా పెడతామని హెచ్‌‌సీఏ సీఈవో సునీల్ కాంటే తెలిపారు.  అండర్‌‌‌‌19 టీమ్‌‌కు ఎంపికైన మరో రాష్ట్రానికి చెందిన ఆటగాడిని కూడా టీమ్‌‌ నుంచి తప్పించినట్టు వెల్లడించారు..