
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ (టీఎఫ్ఎంసీ) ఆధ్వర్యంలో 11వ జాతీయ ఎన్ఈఓఎఫ్ఎం సమిట్ను హైదరాబాద్లో నిర్వహించింది. ఈ సందర్భంగా ఫెసిలిటీ మేనేజ్మెంట్ రంగంలో సుస్థిరత, ఆవిష్కరణలు, భవిష్యత్ టెక్నాలజీలపై లోతైన చర్చలు జరిగాయి. 800 కంపెనీలు పాల్గొన్న ఈ సమ్మిట్ భారతదేశంలోని ఐటీ/ఐటీఈఎస్ రంగంలో ముఖ్యమైన సమావేశంగా నిలిచింది.
ఫెసిలిటీ మేనేజ్మెంట్ రంగం భవిష్యత్తులో ఏఐ, సస్టైనబిలిటీ ద్వారా ఎలా మారబోతుంది ? అనే అంశంపై లోతైన సమాచారాన్ని అందించింది. ఈ సందర్భంగా, టీఎఫ్ఎంసీ, లీడర్షిప్ టీమ్తో మౌలిక సదుపాయాలపై సలహా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమిట్లో 800 మందికి పైగా ఫెసిలిటీ మేనేజ్మెంట్ నిపుణులు, ఐటీ/ఐటీఈఎస్ కంపెనీల సీఈఓలు, సీఎక్స్ఓలు, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక సంస్థ లేదా భవన కార్యాచరణను సమర్థవంతంగా నిర్వహించడాన్ని ఫెసిలిటీ మేనేజ్మెంట్ అంటారు.