హైదరాబాద్‌‌లో గంజాయి వ్యాపారిపై పీడీ యాక్ట్

హైదరాబాద్‌‌లో  గంజాయి వ్యాపారిపై పీడీ యాక్ట్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌లో గంజాయి హోల్‌‌సేల్ వ్యాపారిగా పేరుగాంచిన ధూల్​పేటకు చెందిన లఖాన్ సింగ్‌‌పై ఎక్సైజ్ అధికారులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈయన ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి స్థానికంగా అమ్ముతుంటాడు. ఎనిమిది నెలల్లో మూడుసార్లు ఎక్సైజ్​ ఎస్‌‌టీఎఫ్ టీమ్ లీడర్ అంజిరెడ్డి బృందానికి పట్టుబడ్డాడు. వివిధ పోలీస్​, ఎక్సైజ్​ స్టేషన్లలో 30కు పైగా కేసులు ఉన్నాయి. 

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం సిఫార్సుతో హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన పీడీ యాక్ట్ నమోదుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ధూల్​పేట ఎక్సైజ్ ఎస్సై మధుబాబు పీడీ యాక్ట్​ ఉత్తర్వులను లఖాన్ సింగ్‌‌కు అందించారు.