స్వీట్లలో గులాబ్జామూన్ టాప్.. స్విగ్గీ యాన్యువల్ రిపోర్టు-2019లో వెల్లడి
ఇండియన్స్ఫేవరేట్డిష్గా చికెన్ బిర్యానీ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్రముఖ ఫుడ్డెలివరీ యాప్ స్విగ్గీలో నిమిషానికి 95 ఆర్డర్లతో టాప్ ప్లేస్లో నిలిచింది. ఈ ఘనత సాధించింది. స్విగ్గీ తన యాన్యువల్రిపోర్టు–2019లో దీన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు అందిన ఆర్డర్ల ఆధారంగా రూపొందించిన ఈ రిపోర్టులో ఇండియన్స్ ఫుడ్ ఇంట్రెస్ట్లకు సంబంధించిన మరెన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి.
హ |
హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేవి.. ఒకటి చార్మినార్, రెండు బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీకి ఉన్న ఆ క్రేజే వేరు. ఒక్క హైదరాబాదే కాదు, ఇప్పుడు ఇండియన్లంతా బిర్యానీనే కావాలంటున్నారు. వేడివేడిగా పొగలు కక్కే బిర్యానీ నోట్లో పడితే ఆ టేస్టే వేరప్పా అంటున్నారు. రెస్టారెంట్కెళ్లి మెనూ కార్డ్ చూసినా, ఫుడ్ డెలివరీ యాప్లు ఓపెన్ చేసినా చాలా మంది వేళ్లు, కళ్లు బిర్యానీ దగ్గరే ఆగిపోతున్నాయి. టక్కున ఆర్డర్ పెట్టేస్తున్నాయి. ఇప్పుడు స్విగ్గీ విడుదల చేసిన యాన్యువల్ ‘స్టాట్ఈటిస్టిక్స్’ రిపోర్టు కూడా అదే చెబుతోంది. ఎక్కువ మంది బిర్యానీకే ఓటేస్తున్నారని చెప్పింది. ఇండియన్ల ఫేవరెట్ డిష్గా మారిపోయిందంటోంది. దేశంలో నిమిషానికి సగటున 95 (సెకనుకు 1.6) ఆర్డర్లు బిర్యానీవే ఉన్నాయంటోంది. ఆ బిర్యానీల్లో ఎక్కువ ఆర్డర్లతో ‘చికెన్ బిర్యానీ’ కింగ్గా నిలిచింది. ఈ ఏడాది రిలీజ్ చేసిన నాలుగు రిపోర్టుల్లోనూ బిర్యానీనే టాప్గా నిలిచింది. బిర్యానీ తర్వాత దక్షిణాదోళ్లు ఎక్కువగా ఇష్టపడే మసాల దోష రెండో ర్యాంకును దక్కించుకుంది. చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీలు టాప్5లో చోటు దక్కించుకున్నాయి. పుణెలోని చికెన్సజుక్బిర్యానీ (రూ.1,500) ఖరీదైన బిర్యానీగా, ముంబైలోని తవా బిర్యానీ (రూ.19) పాకెట్ఫ్రెండ్లీ బిర్యానీగా నిలిచాయి.
స్వీట్లలో గులాబ్జామూన్ రారాజు
డిజర్ట్లలో గులాబ్జామూన్ రారాజుగా నిలిచింది. దేశమంతటా ఈ ఏడాది 17,69,399 ఆర్డర్లు గులాబ్జామూన్వే. ఈ ఏడాది లిస్టులో కొత్తగా ఫలూడాచేరింది. డిజర్ట్లలో టాప్2 ప్లేస్ను దక్కించుకుంది. ఈ ఏడాది మొత్తంగా 11,94, 732 ఆర్డర్లు ఫలూడావే. ఒక్క ముంబైలోనే 6 వేల సార్లు ఫలూడాను ఆర్డర్ చేశారు. ఆ తర్వాత చాకో పై అండ్ డ్రింక్ను ఒక్క చండీగఢ్లో 79,242 సార్లు ఆర్డర్ చేశారు. మొత్తం 3 లక్షల కేక్ ఆర్డర్లు రాగా, అందులో టాప్లో నిలిచింది బ్లాక్ ఫారెస్ట్. డెత్ బై చాక్లెట్, టెండర్ కోకోనట్ ఐస్ క్రీం, తిరమిసు ఐస్ క్రీమ్, కేసర్ హల్వాలనూ జనం ఎక్కువగా ఆర్డర్ చేశారు. ఇటు కిచిడీకి ఫ్యాన్లు పెరిగిపోయారు. ఈ ఏడాది దాని ఆర్డర్లు 128 శాతం పెరిగాయి. మేతి మలాయ్ పనీర్, ధాబా దాల్ విత్ రైస్, చపాతీస్ థాలి, గోబి మటర్ మసాలా, దాల్ మఖానీ విత్ జీరా రైస్, మినీ దోసె, ఇడ్లీ, వడ, సాంబార్ థాలిలకు డిమాండ్ పెరిగింది.
ఆరోగ్యంపై శ్రద్ధ
ఫుడ్ ఆర్డర్ పెట్టేటోళ్లు ఆరోగ్యంపైనా శ్రద్ధ పెడుతున్నట్టు స్విగ్గీ రిపోర్టులో తేలింది. మొత్తం ఆర్డర్లలో 3.5 లక్షల ఆర్డర్లు హెల్త్ను దృష్టిలో పెట్టుకునే ఇచ్చారు. అందులో భాగంగా కీటో ఫుడ్డుకు ఓటేస్తున్నారు జనం. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది కీటో ఫుడ్డు ఆర్డర్లు 306 శాతం పెరిగాయి. కీటో బ్రౌనీస్, కీటో ఫ్రెండ్లీ టస్కన్ చికెన్, హెల్దీ రెడ్ రైస్ పోహా వంటి వాటిని జనం ఆర్డరిచ్చారు. అన్నింట్లోనూ కీటో బ్రౌనీస్ను ఎక్కువగా ఆర్డరిచ్చారు. అంతేకాదు, గోమూత్రాన్నీ కొందరు ఆర్డరిస్తున్నట్టు తేలింది.
గుంటూరు నుంచి ఎక్కువ ఆర్డర్లు
ప్రస్తుతం 530 సిటీల్లో స్విగ్గీ ఫుడ్డును డెలివరీ చేస్తోంది. ఈ ఏడాది కొత్తగా వరంగల్, గుంటూరు, వైజాగ్, మదురై వంటి సిటీలను లిస్టులో చేర్చింది. లాంచ్చేసిన వారం రోజుల్లోనే రోజూ సగటున వెయ్యి ఆర్డర్లు ఆయా సిటీల నుంచి వస్తున్నాయి. ఏపీలోని గుంటూరు నుంచి రోజూ 2,500కు పైగా ఆర్డర్లు వస్తున్నట్టు స్విగ్గీ రిపోర్టు తేల్చింది. ఫుడ్డును అందించే డెలివరీ గర్ల్స్లో కొచ్చికి చెందిన సుధ రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది మొత్తం ఆమె 6,838 ఆర్డర్లను అందించారు. మొత్తం వెయ్యి మందికిపైగా మహిళలు స్విగ్గీ ఫుడ్ డెలివరీ పార్ట్నర్స్గా ఉన్నారు.