
పద్మారావునగర్, వెలుగు: మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్యాట్నీ జంక్షన్ సమీపంలో ఓ పెల్టో ఫోరం చెట్టు భారీగా పెరగడంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ ఉన్నతాధికారుల సూచనల మేరకు నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు ఆధ్వర్యంలో మంగళవారం చెట్టును నుంచి తొలగించారు.
వెటా ఫౌండేషన్ సహకారంతో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆ చెట్టును జాగ్రత్తగా సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ ఆవరణకు తరలించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు నజీముద్దీన్, శ్రీధర్, మహేశ్, మోహిత్ , సత్యనారాయణ పాల్గొన్నారు.