
హైదరాబాద్కు చెందిన 27 ఏళ్ల సయ్యద్ వసీమ్ అలీ అనే యువకుడు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అమెరికా సమయం ప్రకారం ఆదివారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. శాన్ఫ్రాన్సిస్కో బేవ్యూ జిల్లాలో పాల్ ఎవెన్యూ ప్రాంతంలో అలీ ప్రయాణిస్తున్న కారును… మరో కారు బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళకు గాయాలు అయ్యాయి. ఆమె స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అలీ అంత్యక్రియాలను అమెరికాలోనే నిర్వహించాలని తల్లిదండ్రులు నిశ్చయించుకోవడంతో.. వారి వీసా ప్రాసెస్కు సహాయం చేయాలని విదేశాంగశాఖ మంత్రిని అమెరికాలోని స్థానిక ముస్లిం సంస్థ, అలీ తల్లిదండ్రులు కోరారు. తాము అమెరికా వెళ్లేందుకు చట్టపరమైన అనుమతులు పొందేలా సహాయం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్, హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ను అలీ తల్లిదండ్రులు కోరారు.