రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, ఎల్లుండి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందన్నారు. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనంతో వర్షాలు పడుతున్నాయన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కల్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికే చాలా ధాన్యం తడవటంతో రైతులు అలర్ట్ గా ఉండాలన్నారు అధికారులు.
మరిన్ని వార్తల కోసం
సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా
హీరో సూర్యకు నోటీసులు