
- 86.1 కిమీల దూరం..రూ.19,579 కోట్ల వ్యయంతో డీపీఆర్లు
- ఫ్యూచర్ సిటీకి భారత్ ఫ్యూచర్ సిటీగా నామకరణం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 పార్ట్ (బి) ప్రతిపాదనను శనివారం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రతిపాదనలో అన్ని డాక్యుమెంట్లు, డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డీపీఆర్లు) ఉన్నాయని, ఇవి రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మరింత బలోపేతం చేయడంతో పాటు ఎకనామిక్ గ్రోత్ కు ఊతమివ్వనుందని తెలిపారు. అలాగే, ఫ్యూచర్ సిటీకి భారత్ ఫ్యూచర్ సిటీగా నామకరణం చేసినట్లు మెట్రో ఎండీ పేర్కొన్నారు.
86.1 కిమీ దూరం, 19,579 కోట్లు..
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పార్ట్ (బీ) మూడు కారిడార్లను కలిగి ఉంది. రూ. 7,168 కోట్లతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కి.మీల నిర్మాణం జరుగనుంది. రూ. 6,946 కోట్లతో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కి.మీ, జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు 22 కి.మీ.. రూ. 5,465 కోట్లతో ప్లాన్ చేశారు. మొత్తం 86.1 కి.మీల పొడవుతో , రూ. 19,579 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు డీపీఆర్లు రూపొందించారు. ఈ ప్రతిపాదలనలను రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా నిర్మితమవుతుంది.