గణేష్ నిమజ్జనం సందర్భంగా అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు

గణేష్ నిమజ్జనం సందర్భంగా అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు

గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో తన సేవలు పొడిగింది. మెట్రో రైళ్లను గురువారం(సెప్టెంబర్ 28) ఉదయం 6 గంటల నుంచి (సెప్టెంబర్ 29) అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. భక్తుల రద్దీ దృష్ట్యా మెట్రోరైలు సమయాన్ని పొడిగిస్తున్నామని మెట్రో అధికారులు వెల్లడించారు. 

మెట్రో పొడిగించిన సేవలు గురువారం(సెప్టెంబర్ 28) ఉదయం 6 గంటలకు ప్రారంభమై.. శుక్రవారం(సెప్టెంబర్ 29) అర్ధరాత్రి 1 గంటల వరకు కొనసాగుతాయి. భారీ గణేష్ నిమజ్జన ఊరేగింపులలో పాల్గొనే వేలాది మంది భక్తులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తుందని అధికారులు తెలిపారు. 

చివరి రైలు సెప్టెంబర్ 29 తెల్లవారుజామున 1 గంటలకు ప్రారంభ స్టేషన్ల నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి, సుమారు 2 గంటలకు సంబంధిత గమ్యస్థానాలకు చేరుకుంటుందని ప్రకటించారు. ప్రయాణం సాఫీగా సాగేందుకు ప్రయాణికులు భద్రతా సిబ్బందికి, మెట్రో సిబ్బందికి సహకరించాలని హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు కోరారు.