హైదరాబాద్ లో పోలీస్ బండ్లకు కొత్త మెరుగులు

హైదరాబాద్ లో పోలీస్ బండ్లకు కొత్త మెరుగులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: సిటీ పరిధిలోని అన్ని పెట్రోలింగ్, పోలీస్​వెహికల్స్​కు మెరుగులు దిద్దనున్నారు. సిటీ సీపీ సీవీ ఆనంద్​ఆదేశాల మేరకు 188 పోలీస్​వెహికల్స్​ను సిటీలోని ఆర్మ్​ పోలీస్​హెడ్​క్వార్టర్స్​కు తరలించారు. ఇప్పటికే ఆ వాహనాలపై ఉన్న పాత పోలీస్ స్టిక్కర్లను తొలగించి  కొత్త స్టిక్కర్లు అంటించారు. 

రిపేర్ల కోసం  రూ.1.6 కోట్లు కేటాయించారు. మెషిన్ పాలిషింగ్, బంపర్లు, డోర్లు, ప్యానెళ్లపై డెంటింగ్, పెయింటింగ్, ఇంజిన్ రిపేర్లు, ఇంటర్నల్​హార్డ్​వేర్​పనులు చేసి వాహనాలు పూర్తిస్థాయిలో కండిషన్​లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 134 పెట్రోలింగ్​వాహనాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు.

నేటి హైడ్రా ప్రజావాణి వాయిదా

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రతి సోమవారం హైడ్రా నిర్వహించే ప్రజావాణి వాయిదా వేసినట్టు అధికారులు తెలిపారు. సోమవారానికి బదులుగా మంగళవారం నిర్వహించనున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. చెరువులు, కుంటలు, పార్కుల ఆక్రమణలపై  బుద్ధ భవన్​లో ప్రజావాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

అనివార్య కారణాల వల్ల ఈ సారి సోమవారానికి బదులు మంగళవారం హైడ్రా ప్రజావాణి జరుగుతుందని తెలిపారు. వచ్చే వారం నుంచి యాధావిధిగా ప్రజావాణి జరుగుతుందన్నారు.