
హైదరాబాద్ వాసులు జొమాటోలో ఆర్డర్ చేసిన ఫిష్ బిర్యానీలో చనిపోయిన బొద్దింక, వైరల్ రెడ్డిట్ పోస్ట్లో ఫోటోలు వైరల్ అయ్యాయి.
బిర్యానీ అంటే ఎవ్వరికైనా ఇష్టమే.. ఇక హైదరాబాద్ బిర్యానీ.. అంటే నాన్ వెజ్ ప్రియులెవరైనా లొట్టలేసుకుంటూ తింటారు.. హోటళ్లు, రెస్టారెంట్లు అందుబాటులో లేకపోతే ఆర్డర్ ఇచ్చి మరి తెప్పించుకుంటారు.. అయితే, ఫిష్ బిర్యానీ తిందామని అనుకొని జొమాటోలో ఆర్డరిచ్చి ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి ఫిష్ బిర్యానీ తెప్పించుకున్న వ్యక్తికి దిమ్మతిరిగే షాక్ తగిలింది
హైదరాబాద్ బిర్యానీ భోజనంలో కీటకాలు .. బొద్దింకలు తేలుతున్నాయి. హైదరాబాద్ నివాసి రెడ్డిట్లో హైదరాబాద్ బిర్యాని గురించి @maplesyrup_411 హ్యాండిల్లో పోస్ట్ చేశారు. తాను కోటిలోని గ్రాండ్ హోటల్ నుండి జొమాటో-ఆర్డర్ చేసిన బిర్యానీలో చనిపోయిన బొద్దింకలు వచ్చాయని పోస్ట్ చేశారు. బహుశా హోటల్ వారు నాకు అదనంగా ప్రోటీన్స్ ఇద్దామనుకున్నారా.. అందుకే చనిపోయిన బొద్దింకలను ఫిష్ బిర్యానీలో మిక్స్చేసి పంపించారని తెలిపాడు.
దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతోనే అది వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు స్పందించారు. కొంతమంది ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు. ఒక వినియోగదారుడు మాత్రం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ... మీరు హోటల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేయండి... ఇక్కడ రోజు వందల మంది తింటారు.. నేను కూడా నెలకు రెండు మూడు సార్లు అక్కడ తింటానని ఒకరు పోస్ట్ చేశారు. ఇది చాలా షాకింగ్ ఉందని మరొకరు పోస్ట్ చేస్తారు.