హైదరాబాద్‌లో 38 హాస్టళ్లకు నోటీసులు.. 7 కిచెన్లు క్లోజ్

హైదరాబాద్‌లో 38 హాస్టళ్లకు నోటీసులు.. 7 కిచెన్లు క్లోజ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని ప్రైవేట్​హాస్టళ్లలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం ఎల్బీనగర్ జోన్‌‌‌‌లోని శ్రీనగర్ కాలనీ, లలితానగర్, దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్, కూకట్‌‌‌‌పల్లి జోన్‌‌‌‌లోని కేపీహెచ్ బీ, మూసాపేట, శేరిలింగంపల్లి జోన్‌‌‌‌లోని వినాయక్ నగర్, పత్రికా నగర్‌‌‌‌లో స్పెషల్​డ్రైవ్ కొనసాగింది. 

మొత్తం 60 హాస్టళ్లను తనిఖీ చేసి 38 హాస్టళ్ల యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. 7 హాస్టళ్ల కిచెన్లను క్లోజ్​చేశారు. లైసెన్స్ లేకపోవడం, ఫుడ్ క్వాలిటీ, ఫైర్ సేఫ్టీ, శుభ్రత పాటించని హాస్టళ్లకు రూ.2,46,000- జరిమానా విధించారు.