
మల్కాజిగిరి, వెలుగు: గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించడంలో సమర్దవంతంగా పనిచేసిన ట్రాఫిక్ పోలీసులను రాచకొండ సీపీ సుధీర్బాబు అభినందించారు. జోన్-2 పరిధిలోని 730 మంది ట్రాఫిక్ సిబ్బందికి ఒక్కొక్కరికీ కాంప్లిమెంటరీగా సుమారు రూ. 7800 విలువైన కిట్ను అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 41,83,664 ఖర్చుతో ఈ కిట్లను అందిస్తున్నట్టు తెలిపారు. వీటిలో 9 రకాల వస్తువులు ఉన్నాయని .. వాటిలో వాటర్ రెసిస్టెంట్ బ్యాగ్, ఎల్ఈడీ లాఠీ, రిఫ్లెక్టివ్ జాకెట్, రెయిన్ కోట్, వాటర్ బాటిల్, జంగిల్ షూ, గాగుల్స్, హెడ్ గేర్ వంటి పరికరాలు ఉన్నట్టు తెలిపారు. ట్రాఫిక్ విధుల నిర్వహణలో స్వీయ-క్రమశిక్షణ, భద్రత అవసరం అని తెలిపారు.