మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న కాకా మెమోరియాల్ టోర్నీ

మంచిర్యాల జిల్లాలో  కొనసాగుతున్న కాకా మెమోరియాల్ టోర్నీ
  •     రెండో రోజుల గెలిచిన మంచిర్యాల, నిర్మల్ జట్లు 

కోల్ బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం13 బెటాలియన్ పోలీస్ గ్రౌండ్స్​లో కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ పోటీలు రెండో రోజుకు చేరుకున్నాయి. విశాక ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్​సీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయిలో పోటీల్లో మంచిర్యాల, నిర్మల్​జట్లు గెలుపొందాయి.

 ఉదయం నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో.. మొదట బ్యాటింగ్ చేసిన నిర్మల్ 9 వికెట్ల నష్టానికి 177 రన్స్ చేసింది. జాదవ్ యువరాజ్ 28 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్స్​లతో 55 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. 

అవినాశ్ జాదవ్ 28, వినయ్ 25 రన్స్ చేశారు. బౌలర్ మోరే ఆకాశ్ నాలుగు ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ దిగిన ఆసిఫాబాద్ జట్టు 19.4 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. వినయ్ ​నాలుగు వికెట్లు తీశాడు. బ్యాటింగ్​తోపాటు బౌలింగ్​లో సత్తాచాటిన వినయ్​కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఆదిలాబాద్​ను కట్టడిచేసిన మంచిర్యాల

మరో మ్యాచ్​లో ఆదిలాబాద్ జట్టుపై మంచిర్యాల విజయం సాధించింది. మొదట బ్యాటింగ్​చేసిన మంచిర్యాల 18 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 రన్స్ చేసింది. సాయికృష్ణ(37), ఇస్మాయిల్ అహ్మద్(29) రాణించారు. బౌలర్లు సైక్ ఆమన్, చందన్ చెరో రెండు వికెట్లు తీశారు. 

అనంతరం బ్యాటింగ్ దిగిన ఆదిలాబాద్ టీమ్​ నిర్ణీత ఓవర్డలో తొమ్మిది వికెట్లు కోల్పోయి  కేవలం 113 రన్స్​మాత్రమే చేశారు. 35 పరుగులు చేసి 2 వికెట్లు తీసిన మంచిర్యాల కెప్టెన్ సాయికృష్ణారెడ్డి మ్యాన్ ఆఫ్ ది  మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. హెచ్​సీఏ కోచ్ ప్రదీప్ అవార్డులు అందజేశారు.