అండర్19 ఆసియా కప్‌‌‌‌ టీమ్‌‌‌‌లో అవనీశ్, అభిషేక్

అండర్19 ఆసియా కప్‌‌‌‌ టీమ్‌‌‌‌లో అవనీశ్, అభిషేక్

ముంబై: హైదరాబాద్​ యంగ్ క్రికెటర్లు అవనీశ్​రావు, ఎం. అభిషేక్​ ఏసీసీ అండర్ 19 ఆసియా కప్‌‌‌‌లో పోటీపడే ఇండియా టీమ్‌‌‌‌కు ఎంపికయ్యారు. డిసెంబర్ 8 నుంచి యూఏఈలో జరిగే ఈ టోర్నీ కోసం ఆలిండియా జూనియర్ సెలెక్షన్​ కమిటీ 15 మందితో కూడిన టీమ్‌‌‌‌ను శనివారం ప్రకటించింది.  పంజాబ్‌‌‌‌కు చెందిన ఉదయ్ సహరన్​ కెప్టెన్‌‌‌‌గా, మధ్యప్రదేశ్​ క్రికెటర్ సౌమి కుమార్ వైస్ కెప్టెన్‌‌‌‌గా ఎంపికయ్యారు. 

హైదరాబాద్‌‌‌‌ నుంచి కీపర్‌‌‌‌‌‌‌‌ అవనీశ్, ఆల్‌‌‌‌రౌండర్ అభిషేక్‌కు అవకాశం లభించింది. ట్రావెలింగ్, నాన్‌‌‌‌ ట్రాలెవింగ్ రిజర్వ్‌‌‌‌లుగా మరో ఆరుగురిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ టోర్నీలో అత్యధికంగా ఎనిమిదిసార్లు విజేతగా నిలిచిన ఇండియా ఈసారి గ్రూప్‌‌‌‌1లో  పాకిస్తాన్, అఫ్గానిస్తాన్​, నేపాల్‌‌‌‌తో కలిసి బరిలోకి దిగుతోంది.  తొలి మ్యాచ్‌‌‌‌లో వచ్చే నెల 8న అఫ్గాన్‌‌‌‌తో పోటీ పడనుంది. 10న పాకిస్తాన్‌‌‌‌తో, 12న నేపాల్‌‌‌‌తో తలపడుతుంది. 15న సెమీఫైనల్స్, 17న ఫైనల్ మ్యాచ్‌‌‌‌ జరుగుతుంది.