హైదరాబాద్ సిటీ, వెలుగు: 2025 సంవత్సరానికి నగరం ఘనంగా వీడ్కోలు పలికింది. 31 డిసెంబర్రాత్రి ఉత్సాహంగా గడిపారు. ఐటీ కారిడార్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, సికింద్రాబాద్, అబిడ్స్, ట్యాంక్బండ్, ఓయూ క్యాంపస్, మొయినాబాద్, శంకర్పల్లి తదితర ప్రాంతాల్లో కొత్త ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్చెప్పారు. పబ్బులు, క్లబ్బులు, రిసార్టులు, ఫామ్హౌస్లు, ఈవెంట్స్ఏరియాల్లో అర్ధరాత్రి వరకు సంబురాలు చేసుకున్నారు.
బేగంపేట కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో రసూల్పూరలోని పోలీస్ హాకీ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో టాలీవుడ్ నేపథ్య గాయకులు పావని, నందకిషోర్ టీమ్పాడిన పాటలు ఉర్రూతలూగించాయి. ఇంటర్నేషనల్డీజేలు వనీష్, ఎక్స్టసీలు యువతను హుషారెక్కించారు. ఎల్బీనగర్ జీఎస్ఆర్కన్వెన్షన్లో సింగర్సునీత, ఆర్పీ పట్నాయక్ పాటలు ఆకట్టుకున్నాయి. హైటెక్స్లో రామ్మిరియాల జోష్ నింపారు. బిగ్బుల్పబ్లో ఇంటర్నేషన్ డీజే ఆప్టరాల్ షో అలరించింది. హాయ్ల్యాండ్లో రాహుల్ సిప్లిగంజ్లైవ్మ్యూజికల్ఫర్మామెన్స్తో అదరగొట్టారు. ఓపెన్ గ్రౌండ్స్, కన్వెన్షన్ హోటల్స్ లో, హైటెక్స్ ఎరినా గ్రౌండ్స్ లో భారీ న్యూ ఇయర్ ఈవెంట్స్జరిగాయి.
ఫ్లై ఓవర్ల మూసివేత.. డ్రంక్ అండ్ డ్రైవ్
ట్రాఫిక్ నియంత్రణ కోసం అన్ని ఫ్లైఓవర్లను (బేగంపేట్, టోలిచౌకి మినహా) మూసివేశారు. ట్యాంక్బండ్ పైకి, నెక్లెస్ రోడ్ లోకి, ఎన్టీఆర్ మార్గ్ లో వాహనాల రాకపోకలను నిషేధించారు. రాత్రి 7 గంటల నుంచే డ్రంక్అండ్డ్రైవ్ తనిఖీలు మొదలుపెట్టి ఉదయం 6 గంటల వరకు డ్రంక్అండ్డ్రైవ్తనిఖీలు చేశారు. చాలాచోట్ల రాత్రి 9 గంటల్లోపే ఫుల్లుగా తాగి బండ్లు నడుపుతూ దొరికారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్వద్ద తనిఖీలు నిర్వహించగా, ఓ ఆటో డ్రైవర్ కు 242 పాయింట్లు వచ్చింది. ఫలక్నుమాలో నిర్వహించిన తనిఖీల్లో ఓ టూవీలర్నడిపే వ్యక్తిని తనిఖీ చేయగా 399 పాయింట్లు వచ్చింది.
వైన్స్ ఎదుట రద్దీతో ట్రాఫిక్ జామ్స్
చాలా చోట్ల వైన్ షాపుల వద్ద క్యూ లైన్లు కనిపించాయి. ఫ్రిజ్లలో పెట్టిన బీర్లు పెట్టినట్టు ఖాళీ కావడంతో చాలాచోట్ల డ్రంబుల్లో ఐస్వేసి అందులో బీర్బాటిల్స్పెట్టి అమ్మారు. కొన్నిచోట్ల మందు కోసం ఎగబడడంతో రోడ్లపై ట్రాఫిక్జామ్స్తలెత్తి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కేఎల్ బార్ అండ్రెస్టారెంట్ నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వైపు వెళ్లే మెయిన్రోడ్డు మొత్తం భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది.
బేకరీలు, బిర్యానీ సెంటర్ల వద్ద రద్దీ
సాయంత్రం నుంచి కేకుల కోసం జనాలు బేకరీలు బాట పట్టారు. ఇయర్ఎండ్నేపథ్యంలో చాలా బేకరీలు కిలో కేక్ను రూ. 200కు ఆఫర్ప్రకటించడంతో ఎగబడ్డారు. చాలా చోట్ల బేకరీల ఎదుట రోడ్ల పక్కనే వందల కేకులను పెట్టి విక్రయించడం కనిపించింది. అలాగే, రాత్రి బిర్యానీ సెంటర్లు కిక్కిరిసిపోయి కనిపించాయి. కొన్ని చోట్ల గిగ్వర్కర్ల సమ్మెతో బిర్యానీ సెంటర్ల ఓనర్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రత్యామ్నాయంగా తమ సిబ్బందికి డెలివరీ బాధ్యతలు అప్పగించారు.
చేవెళ్లలో..
చేవెళ్ల నియోజవర్గంలో ఎక్కువగా ఫామ్ హౌస్ లు ఉండటంతో పట్టణంలో కొత్తం సంవత్సరం కల కనిపించింది. చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి మండల పరిధిలోని అనేక ఫామ్ హౌస్ లు, రిసార్ట్స్ లు ఉండడంతో టౌన్ లో వైన్ షాపులను అందంగా ముస్తాబు చేశారు.
