హైదరాబాద్ కు చెందిన పెద్దినేని సాయితేజ ఇండోనేషియాలోని అగ్నిపర్వతాన్ని అధిరోహించే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు. 2014 నుంచి ప్రపంచంలోని అనేక ప్రముఖ అగ్నిపర్వతాలను అధిరోహిస్తున్నాడు సాయితేజ. రెండేళ్లలో 12 సార్లు వాల్కనో ట్రెక్కింగ్ చేశాడు. ఇందులో భాగంగా ఇండోనేషియాలోని అగుంగ్ అగ్నిపర్వతాన్ని అధిరోహించాలని నిర్ణయించుకున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన వాల్కనో. 60వ దశాబ్ధంలో ఇక్కడ పెద్ద పేలుడు సంభవించి దాదాపు 1,500 మంది చనిపోయారు. అలాంటి అగ్నిపర్వతాన్ని అధిరోహించే క్రమంలో సాయితేజ సరైన అంచనాలు రూపొందించుకోవడంలో విఫలయ్యాడు. ఆ పర్వతాన్ని సరైన దిశలో అధిరోహించడంలో పొరబడ్డాడు. క్లిష్టమైన మార్గంలో వెళ్లడంతో మండుతున్న లావా ఎదురైంది. తప్పించుకోలేక తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం సాయితేజ ఇండోనేషియాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.