చెరువుల‌‌ పున‌‌రుద్ధర‌‌ణ వేగంగా జరగాలి..ఈ వానకాలంలోనే పనులు పూర్తి కావాలి: హైడ్రా కమిషనర్

చెరువుల‌‌ పున‌‌రుద్ధర‌‌ణ వేగంగా జరగాలి..ఈ వానకాలంలోనే పనులు పూర్తి కావాలి: హైడ్రా కమిషనర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల పున‌‌రుద్ధర‌‌ణ ప‌‌నులు వేగంగా జ‌‌ర‌‌గాల‌‌ని హైడ్రా క‌‌మిష‌‌న‌‌ర్  ఏవీ రంగ‌‌నాథ్  అధికారుల‌‌ను ఆదేశించారు. మొద‌‌ట విడ‌‌తగా చేప‌‌ట్టిన 6 చెరువుల పున‌‌రుద్ధర‌‌ణ పనులు త్వర‌‌గా పూర్తి కావాల‌‌న్నారు. సోమ‌‌వారం సున్నం చెరువును ఆయన ప‌‌రిశీలించారు. దీంతో పాటు నార్సింగ్ వ‌‌ద్ద సీఎస్ఆర్​లో భాగంగా త‌‌త్వ రియ‌‌ల్ ఎస్టేట్‌‌ సంస్థ చేప‌‌ట్టిన ముష్కి చెరువును సంద‌‌ర్శించారు. సున్నం చెరువులో డెబ్రీస్‌‌ను తొల‌‌గించే ప‌‌నుల‌‌ను ప‌‌ర్యవేక్షించారు. 

చెరువులోకి వ‌‌ర‌‌ద నీరు నేరుగా చేరేందుకు వీలుగా వెంట‌‌నే ఇన్​లెట్​లను సిద్ధం చేయాల‌‌ని ఆదేశించారు. చెరువు పైభాగంలోని ప్రాంతాల్లో వ‌‌ర‌‌ద సాఫీగా కింద‌‌కు సాగ‌‌డంలేద‌‌నే ఫిర్యాదుల నేప‌‌థ్యంలో చెరువు ఇన్​లెట్ల అవసరాలను  వివ‌‌రించారు. అలాగే మురుగు కాలువ డైవ‌‌ర్షన్ ప‌‌నులు కూడా పూర్తి కావాల‌‌న్నారు. ఈ వ‌‌ర్షాకాలంలోనే చెరువుల‌‌ పున‌‌రుద్ధర‌‌ణ జ‌‌ర‌‌గాల‌‌ని సూచించారు.