
హైదరాబాద్: ఎక్స్(ట్విట్టర్)లోకి హైడ్రా ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్లు ఈవీడీఎం పేరుతో ఉన్న ఎక్స్అకౌంట్ను సోమవారం హైడ్రాగా మార్చారు. ఆ వెంటనే హైడ్రాను ట్యాగ్చేస్తూ సిటిజన్లు పోస్టులు పెట్టడం సార్ట్చేశారు. మొదటగా రాయదుర్గంలో నోటీసులు ఇవ్వకుండా ఇంటిని కూలుస్తున్నారని రేవతి, సుధాకర్ అనే ఇద్దరు సిటిజన్లు పోస్ట్చేయగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఆ కూల్చివేతలకు హైడ్రాకు సంబంధం లేదని సమాధానం ఇచ్చారు.