6 పైపులైన్లలో 45 ట్రక్కుల మట్టి ..అమీర్ పేటలో తొలగించామన్న హైడ్రా క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర్

6 పైపులైన్లలో 45 ట్రక్కుల మట్టి ..అమీర్ పేటలో తొలగించామన్న హైడ్రా క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: అమీర్​పేటలోని మైత్రివనం జంక్షన్, గాయత్రీ నగర్​లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం పర్యటించారు. హైడ్రా, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ అధికారులతో కలిసి పలు పనులను పరిశీలించారు. 

ద‌‌‌‌‌‌‌‌శాబ్దాలుగా చేరిన చెత్తతో అమీర్‌‌‌‌‌‌‌‌పేట జంక్షన్​లో 6 పైపులైన్లు పూడుకుపోవడంతో వరద సాఫీగా సాగలేదన్నారు. ఈ కాలువలో 45 ట్రక్కుల మ‌‌‌‌‌‌‌‌ట్టిని తొల‌‌‌‌‌‌‌‌గించినట్లు తెలిపారు. దీంతో ఈ పైపులైన్లు క్లియర్ అయ్యాయని, ఇకపై వరద సమస్య ఉండన్నారు. 

మ‌‌‌‌‌‌‌‌రో 3 లైన్లలో పూడిక తీయ‌‌‌‌‌‌‌‌డంతో పాటు, ఈ వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌దంతా గాయ‌‌‌‌‌‌‌‌త్రీన‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్​పై ప‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌కుండా అక్కడ కూడా పైపులైన్లలో మ‌‌‌‌‌‌‌‌ట్టిని తొల‌‌‌‌‌‌‌‌గించాలని ఆదేశించారు. వచ్చే వర్షాకాలానికి గాయత్రీ నగర్ ముంపు లేకుండా చూడాలని సూచించారు.