
హైదరాబాద్ సిటీలోని హైటెక్ సిటీ ఏరియా అంటే మాదాపూర్.. ఇక్కడ గల్లీ గల్లీలో పదుల సంఖ్యలో హాస్టల్స్ ఉంటాయి.. పీజీ హాస్టల్స్ ఉంటాయి.. చుట్టూ ఐటీ కంపెనీలు కావటంతో.. లక్షల సంఖ్యలో హాస్టల్స్ ఉంటున్నారు ఉద్యోగులు. అంతేనా.. ఉద్యోగం కోసం హైదరాబాద్ సిటీకి వచ్చేవాళ్లకు కూడా ఈ మాదాపూర్ ఏరియా అడ్డా.. ఎవరూ పరిచయం లేకపోయినా.. ఏదో ఒక హాస్టల్ లో జాయిన్ అవుతూ ఉంటారు..
అయితే మాదాపూర్ ఏరియాలో ఉండే హాస్టల్స్ లో నివాసం ఉంటున్న వాళ్లకు వెరీ వెరీ షాకింగ్ న్యూస్ చెప్పింది హైడ్రా.. మీ హాస్టల్స్ ను నీళ్లు ట్యాంకర్ల ద్వారా వస్తున్నట్లయితే మాత్రం.. అలా నీటి ట్యాంకర్ల ద్వారా వచ్చే నీటిని మీరు ఉపయోగిస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా.. అతి త్వరలోనే ఆస్పత్రిలో జాయిన్ కావటం ఖాయం.. ఎందుకు అంటారా.. హైడ్రా పరిశీలించి.. పరీక్షలు చేసి చెప్పిన విషంయ ఇదే..
Also Read : గోదావరి నదిపై ప్రాజెక్ట్ కడితే బనకచర్ల వివాదం ఉండేది కాదు
మాదాపూర్ సున్నం చెరువు పరిధిలోని భూగర్భజలాలను పరిశీలించిన పీసీబీ తాగునీటిని సరఫరా చేస్తున్న ట్యాంకర్లలోని నీటి నమూనాలపై అధ్యయనం చేసింది. అయితే సున్నం చెరువు నీటితో ఆరోగ్యానికి ప్రమాదకరమని వెల్లడించింది హైడ్రా. నీటి ట్యాంకర్లతో కలుషిత నీటిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది హైడ్రా.
మాదాపూర్ పరిసరాల్లో హాస్టళ్ల విద్యార్థుల ఆరోగ్యంతో నీటి వ్యాపారుల చెలగాటం ఆడుతున్నారు. సున్నం చెరువు పరిసరాల్లోని బోరు నీటిలో 12 రెట్లు అధికంగా సీసం ఉన్నట్లు గుర్తించారు. సున్నం చెరువు పరిసరాల్లోని బోరు నీటిలో 2 నుంచి 3 రెట్లు అధికంగా కాడ్మియం , రెండు రెట్లు అధికంగా నికెల్ ఉన్నట్లు గుర్తించారు. సున్నంచెరువు సమీపంలో బోర్లు వేసి తాగునీటిని సరఫరా చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హైడ్రా వెల్లడించింది.