ఎన్టీఆర్‌ను గద్దె దింపిన పాపంలో నేనూ భాగస్వామినే

ఎన్టీఆర్‌ను గద్దె దింపిన పాపంలో నేనూ భాగస్వామినే

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌‌ను గద్దె దింపిన పాపంలో తాను కూడా ఉన్నందుకు చాలా భాదపడుతున్నానని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు.  వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారని వార్తలు వచ్చాయి. కానీ, ఆయన ఇంకా వైసీపీలో చేరలేదు. కానీ, ఆయన పార్టీ మారుతున్నారంటూ టీడీపీ సభ్యులు అంటున్నారు. వంశీ అసెంబ్లీలో మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. వంశీకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడాన్ని టీడీపీ సభ్యులు తప్పుబట్టారు. దానిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని.. సభ్యులెవరికైనా మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందుకే వంశీకి అవకాశమిచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. ఎన్టీఆర్‌‌ను గద్దె దింపిన పాపంలో తాను కూడా భాగస్వామినయ్యానని, ఆ పాపంలో పాలుపంచుకున్నందుకే తాను 15 ఏళ్లు అధికారానికి దూరంగా ఉండవలసి వచ్చిందని తమ్మినేని బాధపడ్డారు.