- రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే: రాజగోపాల్రెడ్డి
చౌటుప్పల్, వెలుగు: త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ బైఎలక్షన్లో తాను బీజేపీ తరఫున పోటీ చేయడం లేదని, అలాంటి ఆలోచనేదీ లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన చౌటుప్పల్లో మీడియాతో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో.. ఎమ్మెల్సీ పదవి మూడేండ్లు ఉండగానే రాజీనామా చేసి పోటీ చేశానని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి రాకపోవడం, ఎమ్మెల్యేలు పార్టీ మారడం, పార్టీ హైకమాండ్ తగిన నిర్ణయాలు తీసుకోకపోవడం వంటివాటితోనే తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడటం జరిగిందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, ఆ పార్టీని ఓడించడం బీజేపీతోనే సాధ్యమని చెప్పానని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీ తరఫున సాగర్లో పోటీ చేయాలనే ఉద్దేశమేదీ లేదన్నారు. అసలు మీడియాలో ఆ వార్తలను చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పారు.
ఇవి కూడా చదవండి
వామన్రావును చంపేందుకు 10 నెలల కిందే ప్లాన్
లాయర్ కారును వెంటాడి ఢీకొట్టిన లారీ.. 500 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది