నేను మగాళ్లతో పడుకోను!

నేను మగాళ్లతో పడుకోను!

‘‘నేను మగాళ్లతో పడుకోను. ఆయనకు అంత సరదా ఉన్నా .. నాకు మాత్రం లేదు బాబూ”.. ఇదీ ఎవరో మామూలు వ్యక్తి అన్న మాట కాదు. కర్ణాటక స్పీకర్ అన్న మాట. ఇప్పుడు ఆ మాటలు వైరల్ అయిపోయాయి. అసలు ఆయన ఆ మాట ఎందుకన్నారో.. అంటే ..! ఓ చిన్న మాట చెప్పాలి. తోటి కాంగ్రెస్ ఎమ్మెల్యే మునియప్పతో స్పీకర్ రమేశ్ కుమార్ కు భేదాలున్నాయని అక్కడ వార్తలొచ్చాయి. వాటికి వివరణ ఇచ్చిన ముని యప్ప.. ‘‘అలాంటిదేం లేదు. మా మధ్య గొడవల్లేవు. మేం మొగుడు పెళ్లాల్లాంటోళ్లం ” అని అన్నా రు. దానికి బదులుగానే రమేశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకో చట్టబద్ధమైన భార్య ఉందంటూ వ్యాఖ్యానిం చారు. రమేశ్‌‌‌‌, మునియప్పలిద్దరూ కోలార్ నియోజకవర్గాని కి చెందినోళ్లే. ఇద్దరూ అక్కడి నుంచే పోటీ చేయాలనుకున్నారు. టికెట్ విషయంలో వాళ్లిద్దరి మధ్యా విభేదాలున్నా యని రాజకీయ వర్గాల్లో టాక్ . ఈ నేపథ్యంలోనే రమేశ్ కుమార్ వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఇలాంటి వ్యాఖ్యలు రమేశ్ కు కొత్తేం కాదు. ఇంతకు ముందు కూడా అత్యాచార బాధితురాలిపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘రేప్ బాధితురాలికి ఎదురయ్యేటటువంటి కఠిన ప రిస్థితుల్లో కి నన్నూ నెడుతున్నా రు. జరిగిన ఘటన గురిం చి అత్యాచార బాధితురాలిని పదే పదే ఎలా అయితే అడుగుతారో నన్నూ అలాగే అడిగి ఇరకాటంలో కి నెడుతున్నా రు” అని అప్పట్లో రమేశ్ కుమార్ అన్నారు.