నాకు ఎస్కార్ట్​ వద్దు ..డీఐజీ, ఎస్పీలకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి రిక్వెస్ట్​

నాకు ఎస్కార్ట్​ వద్దు ..డీఐజీ, ఎస్పీలకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి రిక్వెస్ట్​

జడ్చర్ల టౌన్, వెలుగు: నియోజకవర్గంలో తాను పర్యటించేటప్పుడు ఎస్కార్ట్​అవసరం లేదని మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​రెడ్డి మంగళవారం జోగులాంబ జోన్​ డీఐజీ చౌహాన్, ఎస్పీ హర్షవర్ధన్​కు లెటర్​ రాశారు. ఆ ప్రతిని వారికి అందజేశారు. పోలీసుల విలువైన సమయాన్ని తనకు ఎస్కార్ట్​గా వినియోగించుకోవడం సరైంది కాదని భావిస్తున్నట్లు తెలిపారు.

నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తనకు పోలీసు శాఖ కల్పించిన ఎస్కార్ట్​ వెహికల్​ సౌకర్యాన్ని ఉపసంహరించుకోవాలని డీఐజీతో పాటు ఎస్పీని కోరారు. ప్రభుత్వం తనకు 2+2 సెక్యూరిటీ ఏర్పాటు చేసిందని, భవిష్యత్​లో ఎస్కార్ట్​ అవసరమైతే ముందుగానే  తెలియజేస్తానన్నారు. ఎమ్మెల్యే లెటర్ సోషల్​ మీడియాలో వైరల్​ గా మారగా.. చూసిన వారంతా ఆయనను అభినందిస్తున్నారు.