హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిజాయితీగా జరిగినవి కాదని, 25 ఏండ్లలో ఇంత దరిద్రమైన ఎన్నికలను ఎప్పుడు చూడలేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రజాకార్లకంటే దారుణంగా మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు వ్యవహరించారన్నారు. మంగళవారం గాంధీభవన్ లో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎక్స్ అఫీషియో ఓట్లతో యాదగిరిగుట్టలో టీఆర్ఎస్ గెలిచిందని, ఆదిబట్లలో తమకు మెజారిటీ వచ్చినా కాంగ్రెస్ కౌన్సిలర్ను తీసుకుపోయి టీఆర్ఎస్ నుంచి చైర్మన్ చేశారని ఆరోపించారు. సిరిసిల్లలో రెబల్స్ పోటీ చేస్తే సస్పెండ్ చేస్తానని చెప్పిన కేటీఆర్, మళ్లీ వారిని పార్టీలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. గజ్వేల్ మున్సిపల్ చైర్మెన్ ను చేస్తానని చెప్పి నారాయణరెడ్డిని సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. కేసీఆర్, కేటీఆర్ లు సిగ్గు, లజ్జ లేకుండా పనిచేస్తున్నారని, గ్రామగ్రామాన తిరిగి, కేసీఆర్, కేటీఆర్ ల తీరును ఎండగడతామని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లే రోజు త్వరలోనే వస్తుందని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ చేసిన స్కాంలపై ఆధారాలను ఈడీ, విజిలెన్స్ కు ఇస్తానని, వీళ్ల దోపిడీని పార్లమెంట్లో ఎండగడతానని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచుతుందని, చిన్న చిన్న గ్రామాలను మున్సిపాల్టీలు చేశారని, వాటిల్లోనూ పన్నులు పెంచుతారని అన్నారు. తనకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తీసుకుని చేస్తానని చెప్పారు.
ఇంత దరిద్రమైన ఎన్నికలు చూడలె : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- తెలంగాణం
- January 29, 2020
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు