కనీస మద్దతు ధర విషయంలో ప్రతీ రైతుకు తాను భరోసా ఇస్తానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కనీస మద్దతు ధరల విధానం మునుపటిలాగే కొనసాగుతుందన్నారు. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై మాట్లాడిన మోడీ వ్యవసాయంలో మార్పులు ప్రస్తుతానికి అవసరమని.. రైతుల కోసం ఈ సంస్కరణను తీసుకొచ్చిందన్నారు. ప్రతీ రైతును తాను అభినందిస్తున్నానన్నారు.
కొత్త బిల్లులతో రైతులు తమ పంటలను ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్చన్నారు. ఈ బిల్లులు వ్యవసాయ మండీలకు వ్యతిరేకం కాదన్నారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో, రబీ సీజన్లో రైతుల నుండి గోధుమలను రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారన్నారు. కనీస మద్దతు ధర కింద రైతులకు లక్ష 13 వేల కోట్లు ఇచ్చామన్నారు.. ఈ మొత్తం గత సంవత్సరంతో పోలిస్తే 30% కంటే ఎక్కువన్నారు.
బస్ భవన్ ముట్టడి.. ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు అరెస్ట్
రాజ్యసభలో గందరగోళం.. 8 మంది ఎంపీలు సస్పెండ్
రాష్ట్రంలో మరో 1302 కేసులు..9 మంది మృతి
During the Coronavirus pandemic, record purchase of wheat has been made from farmers during the Rabi season. Rs 1 lakh 13 thousand crores given to the farmers at MSP. This amount is more than 30% over last year: PM Modi https://t.co/ofLjh2jhQV
— ANI (@ANI) September 21, 2020