
హైదరాబాద్: వివాదాస్పద స్వామి నిత్యానందను పెండ్లి చేసుకోవాలని ఉందంటూ హీరోయిన్ ప్రియా ఆనంద్ సంచలన కామెంట్లు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నిత్యానంద గురించి ఎంతగా వ్యతిరేక ప్రచారం జరుగుతున్నా సరే.. వేలాది మంది భక్తులు ఆయనను ఆరాధిస్తున్నారు. ఆయనను పెండ్లి చేసుకుంటే నా పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మా ఇద్దరి పేరు కాస్త ఒకేలా ఉంటాయి’’ అని అన్నారు. గత కొంత కాలంగా నిత్యానంద సూక్తులను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించగా.. ఆమె పై విధంగా స్పందించారు.