రిపోర్టర్కు పటాన్చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బెదిరింపులు
నామీదనే వార్త రాస్తవా అంటూ బూతుపురాణం
హైదరాబాద్, వెలుగు: భూ కబ్జాలపై వార్త రాసిన ఓ రిపోర్టర్ను ఇంటికొచ్చి కాళ్లు, చేతులు నరికేస్తానంటూ పటాన్చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బెదిరించారు. ఫోన్ చేసి బూతులు తిడితూ.. రికార్డు చేసుకొమ్మంటూ రెచ్చిపోయారు. ఫోన్ కాల్ రికార్డులను పోలీసులు, ఎస్పీ, డీజీపీకి ఇచ్చినా ఎవరేం చేయలేరని.. దిక్కున్న చోట చెప్పుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఎమ్మెల్యేపై కేసు పెట్టాలి: జర్నలిస్టు సంఘాలు
భూములు కబ్జాకు గురవుతున్నాయని, వార్త రాసిన జర్నలిస్ట్ కు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫోన్ చేసి తీవ్రంగా తిట్టడం, చంపేస్తానని బెదిరించడం సిగ్గు చేటని జర్నలిస్ట్ సంఘాలు టీయూడబ్ల్యూజే, తెంజు విమర్శించాయి. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, తెంజు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి ఎ.రమణకుమార్ మాట్లాడుతూ పోలీసులు ఎమ్మెల్యే పై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టుకు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రవర్తనకు నిరసనగా బుధవారం జర్నలిస్టులు ఆందోళనలు చేపట్టాలని పిలుపు నిచ్చారు.