24 గంటలు కరెంట్ ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : జీవన్ రెడ్డి

 24 గంటలు కరెంట్ ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : జీవన్ రెడ్డి

రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు ముందుగా కంటి వెలుగు చేయించుకోవాలన్నారు. ఔరంగజేబు కాలంలో జుట్టు పన్ను ఉంటే ఇప్పుడు కేసీఅర్ పాలనలో ఏసీడీ చార్జీలు ఉన్నాయని విమర్శించారు. ఏసీడి చార్జీలు చట్ట విరుద్ధమని జీవన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయానికి నిర్ణీత సమయంలో కరెంట్ సప్లయ్ చేయాలని కోరారు. 

నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం విషయంలో అధిష్టానందే తుది నిర్ణయమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని చెప్పారు. తనకు  అసెంబ్లీకి పోటీ చేయాలని ఉందన్నారు.  నిజామాబాద్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ బలంగా ఉందని జీవన్ రెడ్డి తెలిపారు.