బాలయ్యతో కలసి పని చేయడం జీవితంలో మర్చిపోలేను : ‘దునియా’ విజయ్

బాలయ్యతో కలసి పని చేయడం జీవితంలో మర్చిపోలేను : ‘దునియా’ విజయ్

కన్నడలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ‘దునియా’ విజయ్ ‘వీరసింహారెడ్డి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ‘గోపీచంద్ నా పాత్ర గురించి చెప్పినప్పుడే చాలా థ్రిల్ అనిపించింది. బాలకృష్ణ గారి సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం. ‘వీరసింహారెడ్డి’ కథలో విలన్ పాత్ర ఒక పిల్లర్‌‌‌‌లా ఉంటుంది.

ప్రేక్షకులకు గుర్తుండిపోయే ఇలాంటి రోల్ చేయడం అదృష్టం. ఇందులో నా లుక్ మొరటుగా ఉంటుంది. ముస‌‌లి మ‌‌డుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కనిపిస్తాను. ఫైట్స్ పవర్ ఫుల్‌‌గా నెక్స్ట్ లెవల్‌లో ఉంటాయి.  అభిమానులకు, ప్రేక్షకులకు గ్రేట్ ఎమోషనల్ జర్నీయే ఈ సినిమా. బాలయ్యతో కలసి పని చేయడం జీవితంలో మర్చిపోలేను. ఆయన్ను ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్‌‌లో చూస్తున్నపుడు దేవుడు లాంటి మనిషి అనిపించింది. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఆయనతో కలిసి నటించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. మంచి పాత్రలు వస్తే విలన్‌‌గా చేయడానికి సిద్ధమే. ఒక నటుడిగా అన్ని పాత్రలు చేయాలని ఉంటుంది’ అని చెప్పాడు.