నా నియోజకవర్గానికి రూ.2 వేల కోట్లిస్తే రాజీనామా చేస్తా

నా నియోజకవర్గానికి రూ.2 వేల కోట్లిస్తే రాజీనామా చేస్తా

నా నియోజకవర్గానికి 2 వేల కోట్లు ఇస్తానంటే రాజీనామాకి సిద్ధమన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. బై ఎలక్షన్ వస్తేనే అభివృద్ధి చేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ దృష్టిలో అభివృద్ది అంటే సిరిసిల్ల, సిద్దిపేటేనని.... మిగత నియోజకవర్గాలు ఏమై పోతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలు కావడం లేదన్నారు. కేసీఆర్ ఎప్పుడూ రాజకీయలబ్ధి తప్పా... ప్రజాపాలనపై దృష్టిసారించడం లేదన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వారన్నారు రాజగోపాల్ రెడ్డి.