ఇవ్వాల, రేపు ఐసెట్ ఎగ్జామ్

 ఇవ్వాల, రేపు ఐసెట్ ఎగ్జామ్
  • అటెండ్ కానున్న 75,932 మంది

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాల కోసం శుక్ర, శనివారాల్లో టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. దీనికి 75,932 మంది అటెండ్ కాను న్నారు. వీరిలో అమ్మాయిలు 38,815 మంది ఉండగా, అబ్బాయిలు 37,112 మంది, ఐదుగురు ట్రాన్స్ జెండర్లు న్నారు. 2రోజులపాటు 4 సెషన్లలో ఎగ్జామ్ జరగనుందని ఐసెట్ కన్వీ నర్ ప్రొఫెసర్ వరలక్ష్మీ తెలిపారు.

మార్నింగ్ సెషన్​ ఉదయం10గంటల నుంచి మధ్యాహ్నం12.30గంటల వరకు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ ఆఫ్టర్ నూన్ సెషన్ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పారు.