నకిలీ సర్టిఫికెట్ తో యూఎస్లో అడ్మిషన్ ఐఈసీ కన్సల్టెన్సీ నిర్వాహకుడు అరెస్ట్

నకిలీ సర్టిఫికెట్ తో యూఎస్లో అడ్మిషన్ ఐఈసీ కన్సల్టెన్సీ నిర్వాహకుడు అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: నకిలీ సర్టిఫికెట్​తయారు చేసి, యూఎస్​లోని ఓ వర్సిటీలో అడ్మిషన్​ఇప్పించిన ఐఈసీ కన్సల్టెన్సీ నిర్వాహకుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్​ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడకు చెందిన దీపక్​రెడ్డి అమెరికాలోని ఓ యూనివర్సిటీలో అడ్మిషన్​ కోసం పంజాగుట్టలో ఉన్న ఐఈసీ కన్సల్టెన్సీ నిర్వాహకుడు వెంకటకిరణ్​ను 2022లో సంప్రదించాడు. ఇందుకోసం అతను రూ.2.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

దీపక్​రెడ్డి రాజస్థాన్​లోని మేవార్​వర్సిటీలో బీటెక్​చదివినట్లు నకిలీ సర్టిఫికెట్​సృష్టించి, అమెరికాలోని యూనివర్సిటీలో అడ్మిషన్​ఇప్పించాడు. ఈ విషయాన్ని దీపక్​రెడ్డి తన తల్లిదండ్రులకు చెప్పగా.. నకిలీ సర్టిఫికెట్​తో అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. 

ఎస్​వోటీ, గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం వెంకట కిరణ్​ను అరెస్ట్​చేశారు. ఇప్పటివరకు ఎన్ని నకిలీ సర్టిఫికెట్లు తయారు చేశాడు.. ఎంత మందిని ఉన్నత చదువుల కోసం ఇతర దేశాలకు పంపించాడనే వివరాలపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.