
నరేంద్ర మోడీని మోరోసారి ప్రధానమంత్రిని చేయడానికి దేశ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. సిట్టింగ్ ఎంపీ జితేందర్రెడ్డితో కలిసి సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 16ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రంలో చక్రంతిప్పుతా అంటున్న సీఎం కేసీఆర్.. ప్రస్తుతం 15 సీట్లుంటే ఏం సాధించారని ప్రశ్నించారు. తన మాయమాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. పూర్తిస్థాయి మెజార్టీ ప్రభుత్వం ఉండగా కేసీఆర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. బీసీల కోసం కేంద్రంలో జాతీయ కమిషన్ను ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు అరుణ. సుస్థిర పాలన, దేశ రక్షణ బీజేపీతో సాధ్యమన్నారు.
పార్టీలకు అతీతంగా డీకే అరుణను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు జితేందర్ రెడ్డి. పదహారు స్థానాలను గెలుస్తామని కేసీఆర్ కలలు కంటున్నారన్నారు. తెలంగాణలో స్థిరమైన పాలన ఉండాలని కేరుకునే కేసీఆర్ కేంద్రంలో మాత్రం హంగ్రావాలని కోరుకుంటున్నారని తెలిపారు జితేందర్ రెడ్డి.