జనక్‌ ప్రసాద్‌కు టికెట్​ ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు సహకరించం

జనక్‌ ప్రసాద్‌కు టికెట్​ ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు సహకరించం

గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్‌‌ రామగుండం టికెట్​ఐఎన్‌‌టీయూసీ సెక్రటరీ జనరల్‌‌ బి.జనక్‌‌ ప్రసాద్‌‌కు ఇవ్వాలని, లేకపోతే సింగరేణి వ్యాప్తంగా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐఎన్‌‌టీయూసీ పక్షాన కాంగ్రెస్‌కు సహకరించబోమని తీర్మానం చేశారు. ఆదివారం గోదావరిఖనిలోని సింగరేణి వ్యాప్తంగా డివిజన్ల తరలివచ్చిన ఐఎన్‌‌టీయూసీ ప్రతినిధులతో వర్కింగ్‌‌ కమిటీ సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా యూనియన్​లీడర్లు మాట్లాడుతూ ఐఎన్‌‌టీయూసీ పక్షాన రామగుండం టికెట్​మాత్రమే కోరుతున్నామని, ఒకవేళ జనక్‌‌ ప్రసాద్‌‌కు ఇవ్వకపోతే కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేయబోమని తీర్మానించినట్లు చెప్పారు. మీటింగ్‌‌లో లీడర్లు బాబర్‌‌ సలీంపాష, ఆర్‌‌డీ చంద్రశేఖర్‌‌, కె.సదానందం, ఎస్‌‌.నర్సింహరెడ్డి, కుమారస్వామి, పి.ధర్మపురి, త్యాగరాజన్‌‌, కాంపెల్లి సమ్మయ్య పాల్గొన్నారు.