- పది రోజుల్లోనే వివేక్ వేల కోట్లు సంపాదించారా?
- ఎన్నికలకు ముందు రైతుబంధుకు అనుమతెట్లా ఇస్తరు ?
- బీజేపీ, బీఆర్ఎస్, ఈసీ ఒక్కటే
- సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్కు దమ్ముంటే ఉస్మానియా యూనివర్శిటీలో మీటింగ్పెట్టి ఓట్లడగాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సవాల్ విసిరారు. కొత్తగూడెంలోని శేషగిరిభవన్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన పది రోజుల్లోనే వివేక్రూ. వేల కోట్లు సంపాదించారా? ఇంత కన్నా విడ్డూరం ఎక్కడైనా ఉందా? పది రోజుల్లోనే వివేక్ ఆర్థిక నేరస్థుడయ్యారా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్ నిమ్స్లో దీక్ష చేస్తున్న టైంలో పరామర్శించేందుకు, అదే టైంలో కేటీఆర్, హరీశ్రావు, కవిత వచ్చారని దీక్ష విరమించకపోతే ప్రాణానికే ప్రమాదముంటుందని ఆందోళన చెందారన్నారు. పరిస్థితి తెలుసుకున్న సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించి కేసీఆర్కు ప్రాణం పోశారన్నారు. కేసీఆర్మాత్రం సోనియాను మోసం చేశాడని విమర్శించారు. బీసీని సీఎం చేస్తామని చెప్తున్న బీజేపీ..బీసీ అయిన బండి సంజయ్ని ఎందుకు అధ్యక్ష పదవి నుంచి తొలగించిందో చెప్పాలన్నారు. లిక్కర్స్కాం నుంచి కవితను కాపాడడంతో పాటు బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంపై అమిత్షాతో కేసీఆర్చర్చించారన్నారు.
పోలింగ్కు కొన్ని రోజుల ముందు రైతు బంధు డబ్బులను ఖాతాల్లో వేసేందుకు ఈసీ అనుమతి ఇవ్వడం కేసీఆర్ కుట్రలో భాగమేనన్నారు. బీఆర్ఎస్ చెప్పిందే బీజేపీ చేస్తోందని, బీజేపీ చెప్పిందే ఈసీ చేస్తుందన్నారు. ఉద్యోగస్తులు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారని వారికి పోస్టల్ ఓటింగ్ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కొత్తగూడెంలో బీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తున్న వనమా వెంకటేశ్వరరావు మరోసారి గెలిస్తే ఆయన కొడుకు అగడాలు, భూ కబ్జాలకు అంతులేకుండా పోతుందన్నారు. బీ ఫారం కొనుక్కొని వచ్చిన మరో అభ్యర్థి జలగం వెంకట్రావ్కు ఓటేస్తే ప్రజలు నష్టపోతారన్నారు. కాంగ్రెస్, సీపీఎం, టీడీపీ, టీజేఎస్మద్దతుతో సీపీఐ తరుపున పోటీ చేస్తున్న ప్రజల మనిషి కూనంనేని సాంబశివరావును గెలిపించాలన్నారు..