కేసీఆర్ నిజమైన హిందువైతే గోవుల అమ్మకాలను ఆపాలి

కేసీఆర్ నిజమైన హిందువైతే  గోవుల అమ్మకాలను ఆపాలి

హైదరాబాద్ : ఎద్దులు, ఆవులను కోయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించినా రాష్ట్రంలో అమలు కావటంలేదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. సుప్రీంకోర్టు ఆదేశాలు ఎందుకు పాటించటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా గోవులను చంపకుండా ఆదేశించాలని డిజీపీని కోరారు. నిజమైన హిందువు అయితే సీఎం కేసీఆర్ గోవుల అమ్మకాలను ఆపాలన్నారు. ఎంపీ అసదుద్దీన్, MIM ఎమ్మెల్యే బలాల నియోజకవర్గాల్లో ఆవుల అమ్మకాలు యధేచ్ఛగా జరుగుతున్నాయని ఆరోపించారు. డీజీపీ ప్రకటనలు తప్ప అమ్మకాలను ఆపటంలేదన్నారు రాజాసింగ్.