పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయున్రి

పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయున్రి

మీకు పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయండిని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో గోదావరి వరదలతో మునిగిపోయిన ఇళ్లను పరిశీలించిన షర్మిల ... తక్షణ సహాయం చేయలేని మీరు, ముఖ్యమంత్రిగా ఎందుకున్నారని ప్రశ్నించారు. వరదలతో ప్రజలు సర్వం కోల్పోయారని గుర్తు చేశారు. నష్టపరిహారం ఇస్తామని హామీ ఇవ్వడం..,, మర్చిపోవడమే కేసీఆర్ కు తెలుసన్నారు. గతంలో వరంగల్, ఖమ్మం రైతులను ఇలానే మోసం చేశారన్న ఆమె... మీడియా ముందు మాట్లాడుతారు.. ఫామ్ హౌజ్ కి వెళ్లి పడుకుంటారని విమర్శించారు. ఇప్పటికే లక్షల మంది జీవితాలు ఆగమయ్యాయని, ఇస్తామని చెప్పిన 10 వేల సహాయం కూడా ఇంకా అందలేదని ఆరోపించారు. ఆ రూ. పది వేలు కూడా సరిపోవన్న షర్మిల.. రూ.25 వేలు సహాయం అందించాలని డిమాండ్ చేశారు.  సహాయం అందిస్తామని రబ్బర్ బియ్యం ఇచ్చారని బాధితులు చెప్తున్నారని షర్మిల చెప్పుకొచ్చారు. అయినా మీరు ఇంకా పదవిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారని ప్రశ్నించారు. ఇలా ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోక పోతే ఎలా ముఖ్యమంత్రి గారు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. వీరితో పాటు పంట నష్టపోయిన రైతులక్కూడా వెంటనే పరిహారం చెల్లించాలని షర్మిల డిమాండ్ చేశారు.