
న్యూఢిల్లీ: వాట్సాప్ అకౌంట్ బ్లాక్ చేశారని, పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్ను శనివారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ పిటిషన్ను ఆర్టికల్ 32 కింద ఎందుకు వేశారని ప్రశ్నించింది.
వాట్సాప్ యాక్సెస్ ప్రాథమిక హక్కు ఎలా అవుతుందని అడిగింది. దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేస్తున్నారని 10 నుంచి 12 ఏండ్లుగా వాట్సాప్లోనే తన క్లయింట్లతో టచ్లో ఉన్నారని తెలిపారు.
ఆకస్మాత్తుగా తన అకౌంట్ ను బ్లాక్ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. ‘‘కమ్యూనికేషన్ కోసం ఇతర యాప్లను ఉపయోగించొచ్చు కదా! ఈ మధ్యే స్వదేశీ యాప్ ఆరట్టై కూడా వచ్చింది. దాన్ని వాడుకోండి’’ అని సూచించింది.