శరీరానికి మద్యం బాటిళ్లు చుట్టుకుని అక్రమ రవాణా

శరీరానికి మద్యం బాటిళ్లు చుట్టుకుని అక్రమ రవాణా

కృష్ణా జిల్లా: ఆంధ్రప్రదేశ్ లోకి లిక్కర్ స్మగ్లింగ్ కంటిన్యూ అవుతోంది. ప్రతీరోజూ ఏదో ఒక చోట పోలీసులు లిక్కర్ తరలిస్తున్నవారిని పట్టుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో లిక్కర్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు విస్సన్నపేట పోలీసులు. పొట్టపై లిక్కర్ బాటిల్స్ పెట్టి… ప్లాస్టర్ తో కవర్ చేసి ఏపీలోకి లిక్కర్ తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. 100 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేశారు.

విస్సన్నపేట పోలవరం వద్ద ఎక్సైజ్‌ పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించగా మద్యం బాటిళ్లతో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. మద్యం సీసాలు శరీరానికి తగిలించుకుని ప్లాస్టర్ ‌తో అతికించుకుని పైన షర్ట్ వేసుకుని.. బైక్ పై దర్జాగా రవాణా చేస్తున్నారు. పోలీసులు తనిఖీలు చేయగా అక్రమ మద్యం బయటపడింది.  నిందితులను దేవరకొండ శ్రీనివాస్ రావు, దేవరకొండ రాజేష్ గా గుర్తించారు. వారు తెలంగాణలోని అశ్వరావుపేటకు చెందినవారని… విస్సన్నపేట పోలీసులు తెలిపారు.